Skip to main content

అవినీతిపై యుద్ధం

ప్రతిరోజూ ట్రాఫిక్ పోలీసు వాడికి, తహసీలు ఆఫీసు గుమాస్తాకి, మున్సిపాలిటీ ఇంజనీరుకి, ఎమ్మెల్యేకి, మంత్రికి మామూళ్ళు సమర్పించుకుంటూ బతుకులీడ్వడం అలవాటైన మనకు అన్నా హజారే చేస్తున్న ప్రయత్నం ఏటికి ఎదురీదడంలా కనిపించవచ్చు. 

అవినీతి ఇప్పుడు దేశంలో ఎంతగా పాతుకు పోయిందంటే, అదొక తప్పనిసరి వ్యవహారంలా ప్రతి ఒక్కరికి అలవాటై పోయింది. ఊళ్లలోకి వెళ్లి పరిశీలిస్తే క్రిందిలాంటి సంభాషణలు వినడం సర్వ సాధారణం.

"కలెక్టర్ ఆఫీసుకు వెల్లినవ్ కదా? పనైందా?"

"కాలేదన్నా, పైసలు అడుగుతున్నడు".

"అరే, పిచ్చోనివా? పైసలు లేందే పనులైతయా?"

పై సంభాషణ ఏం చెప్పుతుంది. ప్రజలు అవినీతి పై నిరసన వ్యక్తం చేయడం లేదు. అదొక ట్రాఫిక్ రూల్ లాగా, ఇంటి పన్నులాగా, కరెంటు బిల్లు లాగా ఇష్టం ఉన్నా లేకపోయినా చేయక తప్పని పనిగా భావిస్తున్నారు. అరవై సంవత్సరాల 'ప్రజా'స్వామ్య పాలన చూసాక ఇక దీన్ని ఎవరూ మార్చలేరన్న భావనకు వచ్చేశారు. ఇక ఇలాంటి భావనకు వచ్చిన తర్వాత "ఎలాగూ మీరు తింటున్నారుగా, వోటేస్తే మాకేమిస్తారు?" అన్న ప్రశ్నలు కూడా మొదలు పెట్టడంలో ఆశ్చర్యమేముంది?

కాని, భూతంలా పెరిగిపోయిన అవినీతికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్ట వలసిన అవసరం ఉంది. దీనికి అన్నా హాజారే పూనుకొని ముందుకు రావడం, జనలోక్పాల్ బిల్లు కోసం పోరాడడం ఏంటో సంతోషించా దగ్గ విషయం. ఆయన తన ప్రాణాలనైనా పణంగా పెట్టి, బిల్లు కోసం చివరి శ్వాస వరకూ పోరాడుతానని ఖరాఖండీగా చెప్పి తన నిబద్ధతను చాటుకున్నారు. ఇక నిబద్ధతను చూపవలసిన అవసరం దేశ ప్రజలపై ఉంది. ప్రజలు ఆయనకిచ్చే మద్దతుపైనే జయాప జయాలు ఆధారపడి ఉంటాయి.

ఇప్పటికే దేశమంతటా అనేక ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా ప్రజలు తమ మద్దతును స్వచ్చందంగా తెలుపు తున్నారు. ఇది చాలా సంతోషించా దగ్గ విషయం. ఇటీవల మరే విషయం పై కూడా ప్రజలంతా ఒక్క తాటిపై నిలబడ్డ దాఖలాలు లేవు. 

సమస్యలను నాన్చుతూ, అవినీతి రాజభోజ్యంగా భావించే కాంగ్రెస్ పార్టీ "అన్నా హాజారే లోక్ పాల్ కమిటీ చైర్మన్ గా ఉండడానికి దీక్ష చేపట్టారని" అర్థంవచ్చేలా వదంతులు వ్యాప్తి చేయడం మొదలు పెట్టింది. దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ అన్నా ఆ పదవికి ఇద్దరు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సూచిస్తూ అధికార పార్టీ కుట్ర పూరిత ఆలోచనలకు ఆదిలోనే అడ్డుకున్నారు.

దేశాన్ని అవినీతి రహిత సమాజంగా మార్చడానికి ఇది సరయిన సమయం. దేశ భక్తులందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం తక్షణావసరం.

Comments

  1. ప్రాంతీయ విద్వేషక విభజన కారులు, కెసిఆర్ అనుచరులు కూడా అవినీతి మీద మాట్లాడుతున్నారహో .. :)))

    ReplyDelete
  2. Snkr

    తెలంగాణా విభజనవాదం మొదలయ్యిందే రాష్ట్రాన్ని తమ పెరటిగేదెలా మార్చుకుని అడ్డూ ఆపూ లేకుండా వేల కోట్లు దిగమింగిన, మింగుతున్న ఆంధ్రా నాయకులకు వ్యతిరేకంగా. సమైక్యవాదాన్ని నర నరానా నింపుకున్న రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, లగడపాటి, రాయపాటి, కావూరి, తిక్కవరపు etc, రాష్ట్రంపై ప్రేమతో అలా మాట్లాడుతున్నారని తమరిలాంటి అమాయకులు భావిస్తున్నారేమో కాని, తెలంగాణా వారికి ఎలాంటి భ్రమలు లేవు.

    ఇక విద్వేషం గురించి మాట్లాడాలంటే, ఒక ప్రాంతం వారిపై నిలువెల్లా ద్వేషం నింపుకుని బ్లాగు బ్లాగూ తిరుగుతూ తమరు పెట్టే కామెంట్లు చదివిన వారికెవరికైనా తెలుస్తుంది, విద్వేషం అంటే ఎలా వుంటుందో!

    ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడానికి మరోసారి ఇక్కడికి రావద్దు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...